జగన్ వదిలిన బాణం ఆయనకే గుచ్చుకోబోతుంది: నక్కా ఆనంద్ బాబు

-

వైయస్ జగన్ వదిలిన బాణం చివరికి ఆయనకే గుచ్చుకోబోతుందని టిడిపి సీనియర్ నేత నక్క ఆనంద్ బాబు అన్నారు. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ…. జగన్ రక్తం పంచుకొని పుట్టిన షర్మిలనే టిడిపి పార్టీ బాగు కోరుతుంది అంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని అన్నారు. వైఎస్ షర్మిల దగ్గరికి వెళ్లడం మాకు అవసరం లేదని ఒకవేళ ఆమె వచ్చిన దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేయమని స్పష్టం చేశారు.

వెంకటరమణ ,కేవీపీ రామచంద్రారావు, సూర్యుడు మొదలైన నాయకులు వైయస్ జగన్ చేతిలో మోసపోయిన బాధితులని అన్నారు. జగన్ను నమ్మి మాపై కేసులు పెట్టిన ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిస్థితి ఏమైందో మనం చూస్తూ ఉన్నామన్నారు. జగన్ పార్టీ పై నమ్మకం లేకనే ప్రశాంత్ కిషోర్ మా పార్టీకి సలహాలు ఇచ్చే పరిస్థితి కలిగిందని చెప్పారు. ఐఏఎస్ అధికారులు కూడా జగన్ అవినీతికి బలైపోతారు కావచ్చు అని జోస్యం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news