జబర్దస్త్ రష్మికి నేనుడబ్బులిచ్చా..ఆధారాలున్నాయి..

-

తెలుగు కామెడీషో జబర్దస్త్ ఫేమ్ రష్మి ఓప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడంపై సామాజిక మాధ్యమం వేదికగా వివాదం చెలరేగింది.ఆదివారం తిరుపతిలో జరగనున్న ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రష్మి హాజరుకాబోతున్నారని కొందరు హోర్డింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ ఫొటోను చూసిన రష్మి ట్విటర్‌లో… అసలు ఆ కార్యక్రమ నిర్వాహకులు తనను సంప్రదించలేదన్నారు… ‘ఈ ఈవెంట్‌లో నాభాగస్వామ్యం లేదు. నా అనుమతి, ప్రమేయం లేకుండా నా ఫొటోల్ని పెట్టేశారుఅంటూ ఆమె పేర్కొన్నారు.

దీంతో సదరుకార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వ్యక్తి రష్మికి రిప్లై ఇచ్చారు. ‘ఈ కార్యక్రమానికివచ్చేందుకు మేం రష్మికి అడ్వాన్స్‌ కూడా ఇచ్చాం. ఆమె రావడానికి ఒప్పుకున్నారు.కానీ ఇప్పుడు దాన్ని ఖండిస్తున్నారు. నేను ఆమె మేనేజర్‌కు డబ్బులు పంపా.. ఆధారాలుకూడా ఉన్నాయి అంటూ అడ్వాన్స్ కి సంబంధించిన కొన్ని స్క్రీన్‌ షాట్లు షేర్చేశారు.వీటిపై రష్మి ప్రతిస్పందిస్తూ.. ఏదైనా చెప్పేముందు కాస్త నిజానిజాలుతెలుసుకోవాలని అన్నారు. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అబద్ధాలుగా తేలుతాయని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటే అలానే చేయండనిచెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news