జర్మన్‌ సింగర్‌ నోట రామ్‌ ఆయేంగే పాట…. నెట్టింట్లో వైరల్

-

ఈనెల 22న అయోధ్యలో జరిగే శ్రీరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అంతేకాకుండా దేశ విదేశాల నుండి ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు కూడా హాజరుకాబోతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న రామ మందిరం ప్రారంభోత్సవం మరికొన్ని గంటల్లో జరగబోతున్న నేపథ్యంలో అయోధ్యతోపాటు యావత్ దేశం రామ నామంతో మారిమోగిపోతుంది.

 

శ్రీరాముడి దర్శనం కోసం దేశ ప్రజలేకాదు.. విదేశీయులు కూడా ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జర్మనీ దేశానికి చెందిన ప్రముఖ గాయని కాసాండ్రా మే స్పిట్‌మన్ శ్రీరాముడికి సంబంధించి ఓ అందమైన పాటను తనదైన శైలిలో ఆలపించి రాముడిపై తనకున్న భక్తిని చాటుకుంది. ‘రామ్‌ ఆయేంగే..’ అంటూ సాగే ఈ పాట ఇండియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లొ తెగ వైరల్‌ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news