Tollywood :నాగార్జున, ధనుష్‌ మల్టీస్టారర్‌ మూవీ….

-

శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో కింగ్ నాగార్జున, తమిళ నటుడు ధనుష్‌ ప్రధాన పాత్రల్లో  ప్రతిష్టాత్మక మల్టీస్టారర్‌ సినిమా పట్టాలెక్కింది. ఈ చిత్రం  గురువారం ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. శ్రీవెంకటేశ్వర సినిమాస్‌, అమిగోస్‌ క్రియేషన్స్‌ పతాకాలపై సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు ఈ సినిమానీ నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను మొదలుపెట్టారు.

 

ఇటీవలే సంక్రాంతి కానుకగా విడుదలైన నా సామి రంగ చిత్రంకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్న సంగతి మనకు తెలిసిందే.అటు తమిళంలో ధనుష్ హీరోగా నటించిన ‘కెప్టెన్‌ మిల్లర్‌’ (తమిళం) సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది . ఈ నేపథ్యంలో తాజా సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.. రష్మిక మందన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా నికేత్‌ బొమ్మి పనిచేస్తున్నారు. ప్రొడక్షన్‌ డిజైన్‌: రామకృష్ణ, మోనికా నిగోత్రే, సమర్పణ: సోనాలి నారంగ్.

Read more RELATED
Recommended to you

Latest news