తిరుమల శ్రీవారి సన్నిధిలో మంత్రి హరీశ్‍ రావు

-


తెరాస ఆరు అడుగుల బుల్లెట్, ట్రబుల్‌ షూటర్‌, మంత్రి హరీశ్‌రావు సోమవారం శ్రీవారిని దర్శించుకున్నారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి లక్ష ఓట్లకుపైగా మెజారిటీతో గెలుపొంది హరీశ్‌రావు సరికొత్త రికార్డులు నెలకొల్పిన సంగతి తెలిసిందే. తెలంగాణలో మాస్ ఫాలోయింగ్ ఉన్న హరీశ్‍ రావుకు ఏపీలోనూ ఫ్యాన్స్ ఉన్నారు. శ్రీవారి దర్శనానికి వెళ్లేముందు హరీశ్‍ రావుతో సెల్ఫీ దిగేందుకు పలువురు యువత ఉత్సాహం చూపారు. తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కడ ఉన్న సంతోషంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్‌ త్వరలో ఖరారు చేయనున్న మంత్రివర్గంలో హరీశ్‌కు తాజాగా ఏ మంత్రిత్వశాఖ కేటాయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news