గూఢచారి సీక్వల్.. త్రినేత్ర 116

-

టాలెంట్ ఉండాలే కాని వందల కోట్లు ఖర్చు పెట్టి తీసే హాలీవుడ్ జేమ్స్ బాండ్ తరహా సినిమాను కేవలం 5,6 కోట్లతో చేసి చూపించొచ్చని ప్రూవ్ చేశారు అడివి శేష్ అండ్ టీం. అడివి శేష్ రాసిన గూఢచారి కథలో అతనే హీరోగా చేసిన సినిమా ఎంత పెద్ద హిట్టైందో తెలిసిందే. అడివి శేష్ హీరోగా శషి కిరణ్ డైరక్షన్ లో వచ్చిన గూఢచారికి ఇప్పుడు సీక్వల్ రెడీ అవుతుంది.

2019 సమ్మర్ లో గూఢచారి 2 మొదలు పెడుతున్నారట. ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఆ విషయాన్ని అఫిషియల్ గా చెప్పాడు. అయితే ఈ సీక్వల్ కు రాహుల్ పాకాల డైరెక్ట్ చేస్తున్నాడని తెలుస్తుంది. గూఢచారి సినిమాకు రాహుల్ అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేశాడు. ఈ సీక్వల్ టైటిల్ గా త్రినేత్ర 116 అని పెట్టబోతున్నారట. 2019లో మొదలై 2020లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

మరి ఈ ప్రాజెక్ట్ గురించి ఇంట్రెస్టింగ్ డీటైల్స్ త్వరలో తెలుస్తాయి. ఏదైనా సూపర్ హిట్ సినిమా సీక్వల్ అంటే ఆ సీక్వల్ మీద ఎన్ని అంచనాలు ఉంటాయో తెలిసిందే. మరి ఆ అంచనాలను గూఢచారి అందుకుంటాడో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news