తుంటి మార్పిడి శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్న కేసీఆర్….

-

మాజీ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కోలుకుంటున్నారు. తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స తర్వాత త్వరితగతిన కోలుకోవడానికి అనుకూలంగా కేసీఆర్ శరీరం సహకరిస్తోందని, ఆయన మానసికంగా కూడా దృఢంగా ఉన్నారని డాక్టర్స్ తెలిపారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో, చేతి కర్ర సహాయంతో నడుస్తున్నారు.

 

 

 

ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో గత నెల 8న తుంటి ఎముక గాయంతో ఆసుపత్రిలో చేరిన కేసీఆర్ ప్రస్తుతం నందినగర్లోని తన నివాసంలో ఉంటున్న సంగతి తెలిసిందే . మరో మూడు నుంచి నాలుగు వారాల్లో కేసీఆర్ పూర్తిగా కోలుకోని త్వరలో ప్రజల ముందుకు రానున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత ఫిబ్రవరి 20వ తేదీన తొలిసారిగా కేసీఆర్ గజ్వేల్ లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎంపీ ఎన్నికలే టార్గెట్ గా వరంగల్ లో కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news