తెలంగాణ రాష్ట్రంలోని హెచ్ఐవి బాధితులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తెలంగాణ హెచ్ఐవి బాధితులకు కూడా త్వరలో కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నట్లు మహిళా మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. కొత్త పెన్షన్ కోసం చేసుకున్న దరఖాస్తులు మొత్తం 13 వేలకు పైగా పెండింగ్లో ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

వాడిని పరిశీలించి ఆర్థిక శాఖకు పంపుతామని వెల్లడించారు సీతక్క. అక్కడ ఆమోదం తెలపగానే పెన్షన్లు మంజూరు చేస్తామని.. వివరించారు. ప్రస్తుతం 36,000 మంది హెచ్ఐవి బాధితులకు పెన్షన్ అందుతుందని.. త్వరలో ఆ సంఖ్య 50 వేలకు చేరే ఛాన్స్ ఉందని తెలిపారు. వాళ్లందరికీ పెన్షన్ అందుతుందని వివరించారు.