నేడు కాంగ్రెస్ గూటికి బండ్ల గణేశ్

-

ప్రముఖ సినీ నటుడు, అగ్ర నిర్మాతల్లో ఒకరైన బండ్ల గణేశ్ శుక్రవారం రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరనున్నారు.  ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో గణేశ్ తో పాటు పలువురు పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. షాద్ నగర్ నియోజకవర్గం టికెట్ ఆశిస్తున్న బండ్లను కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెడితే కాంగ్రెస్ మరింత బలపడటంతో పాటు విజయం సాధించనున్నట్లు కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో నేడు కాంగ్రెస్ గూటికి బండ్ల గణేశ్ వెళ్లనున్నారు. అతి కొద్ది కాలంలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి  అంచెలంచెలుగా  అగ్ర నిర్మాత స్థాయికి బండ్ల గణేశ్ ఎదిగారు.  నిర్మాతగా కొనసాగుతూనే.. రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సినీ పరిశ్రమలోని పెద్దలతోనూ సత్సంబంధాలను ఆయన కొనసాగిస్తున్నారు. రాహుల్ గాంధీతో చాలా ఏళ్ల నుంచే ఆయనకు పరిచయం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news