నేడు తెరాస పాక్షిక మేనిఫెస్టో ప్రకటన

-

తెరాస పార్టీ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పార్టీ పాక్షిక మేనిఫెస్టోనే నేడు తెరాస అధినేత కేసీఆర్ ప్రకటించనున్నారు. తెలంగాణలోని వివిధ వర్గాల ప్రజలు, ప్రాంతాల నుంచి వచ్చిన వినతులు, విజ్ఞప్తులను కేకే అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ పరిశీలించి ప్రజా ఆమోదయోగ్యంగా రూపొందించారు. తొలుత నవంబర్‌లో మేనిఫెస్టో ప్రకటించాలని భావించినప్పటికీ.. మహాకూటమి క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి వెళ్లడంతో పాక్షికంగా రూపొందించిన మేనిఫెస్టోని మంగళవారం విడుదల చేయాలని నిర్ణయించారు. కేసీఆర్ ఆదేశాలతో మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు కేకే మంగళవారం మద్యాహ్నం 2.30 గంటలకు తెలంగాణ భవన్‌లో కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. మేనిఫెస్టోపై రాష్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Read more RELATED
Recommended to you

Latest news