వారికి గీతా మాధురి స్ట్రాంగ్ వార్నింగ్

-

బిగ్ బాస్ రన్నరప్ గీతా మాధురి తాను బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నప్పుడు మీడియా చేసిన రచ్చ గురించి నానా హంగామా చేస్తుంది. హౌజ్ లో తను చేస్తున్న వ్యవహారాల పట్ల బయట జరిగిన పరిణామాలు ఆమె బయటకు వచ్చాక ఒక్కసారిగా షాక్ అయ్యేలా చేశాయి. ముఖ్యంగా తనకి సామ్రాట్ కు లింక్ పెడుతూ వచ్చిన వార్తలు ఆమెని చాలా బాధించాయని తెలుస్తుంది. ఇక ఇష్టమొచ్చినట్టుగా ఈ విధంగా పిచ్చి రాతలు రాసిన వారిని వదిలి పెట్టేది లేదు అంటుంది గీతా మాధురి.

రెండు రోజుల్లో యూట్యూబ్ ఛానెల్స్ అన్ని తన మీద వేసిన వీడియోస్ అన్ని డిలీట్ చేయాలని లేదంటే వారిపై లీగల్ గా యాక్షన్ లోకి దిగుతానని అన్నది గీతా మాధురి. ఈ విషయంపై గీతా మాధురి చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. తన వ్యక్తిగత విషయాల మీద రూమర్స్ పుట్టించే హక్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నిస్తుంది గీతా మాధురి. మొత్తానికి బిగ్ బాస్ రన్నరప్ గీతా మాధురి బయటకు వచ్చాక అసలు గొడవ మొదలైంది.

Read more RELATED
Recommended to you

Latest news