పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేంద్ర మంత్రి

-

హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ని కేంద్ర మంత్రి హన్సరాజ్ మంగళవారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ అంజనీకుమార్ స్వాగతం పలికారు. దేశంలో రెండో ఉత్తమ పోలీస్ స్టేషన్ గా పంజాగుట్ట పీఎస్  ఎంపికైన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో పీఎస్ పరిధిలోని టెక్నాలజీ, అందిస్తున్న రక్షణ సదుపాయాలను చూసి కేంద్ర మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ తరహా టెక్నాలజీని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్టేషన్లలో అందుబాటులోకి తెస్తామని తెలిపారు. తెలంగాణలో అనుసరిస్తున్న పోలీస్ విధానాల వల్ల గత నాలుగేళ్లలో క్రైమ్ రేట్ 40 శాతం, చైన్ స్నాచింగ్ 98 శాతం తగ్గిందని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version