పార్లమెంట్ ఎన్నికల్లో అమిత్ పోటీ చేస్తడు- గుత్తా సుఖేందర్ రెడ్డి

-

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తన కొడుకు గుత్తా అమిత్ రెడ్డి పోటీ చేస్తాడని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. నల్గొండ, భువనగిరిలో ఏదో ఓ స్థానం నుంచి బరిలో ఉండాడని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం పట్టణంలోని ఆయన క్యాంపు ఆఫీసులో మీడియా మాట్లాడుతూ ప్రభుత్వం వేసవిలో తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు పెండింగ్ లో ఉన్న మిషన్ భగీరథ పనులు పూర్తి చేసి కాంట్రాక్టర్లు చేసిన పనులకు త్వరగా పేమెంట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఈ సంక్రాంతి రైతులకు అనుకూలంగా లేదని ఈ సంవత్సరం పంటలు కూడా బాగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో 14 పార్లమెంట్ స్థానాలు గెలుస్తామని అంటున్నారని, అది అయ్యే పని కాదన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనమండలిపై చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థనైనా చులకనగా చూడవద్దని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు లాంటి రాజకీయాలు తెలంగాణలోకి రావద్దని తాను కోరుకుంటున్నాని అన్నారు. రేవంత్ రెడ్డి నెల పరిపాలనపై ఇప్పుడే మాట్లాడలేమని, మంచి చేస్తే స్వాగతిస్తామని గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news