బిఆర్ఎస్ హయాంలో వేగంగా హైదరాబాద్ అభివృద్ధి: కేటీఆర్

-

బిఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ అభివృద్ధి వేగంగా జరిగిందని, మున్ముందు మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ సనత్ నగర్ లో నిర్వహించిన బూత్ లెవల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 100 పడకల ఆసుపత్రిని సనత్నగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేశామని, ఏ అభివృద్ధి, ఏ కార్యక్రమం జరిగినా అది తన నియోజకవర్గంలోనే ముందు పెట్టాలని తలసాని అంటారన్నారు. ఐటీ తదితర రంగాల్లో మరింత ఉపాధి లభించేలా చేస్తామన్నారు.

Hyderabad Pharma City in final stages of resolving legal matters,  anticipate operationalising it soon: K.T. Rama Rao - BusinessToday

అంతే కాక వేములవాడ అసెంబ్లీ టిక్కెట్‌ను బీజేపీ తుల ఉమకు ఇచ్చినట్లే ఇచ్చి లాక్కోవడం చాలా బాధాకరమని మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం తుల ఉమ తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… తుల ఉమ పట్ల ఆ పార్టీ ప్రవర్తించిన తీరు మహిళలు, బీసీల పట్ల ఆ పార్టీ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. గతంలోని హోదాకు మించి ఆమెకు సముచిత స్థానాన్ని కల్పిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆమె పని చేశారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు తుల ఉమకు తాను స్వయంగా ఫోన్ చేసి పార్టీలోకి ఆహ్వానించానన్నారు. తన ఆహ్వానాన్ని మన్నించి ఆమె పార్టీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. వేములవాడ నియోజకవర్గ అభివృద్ధితో పాటు రాష్ట్రంలోని మహిళా అభ్యున్నతి కోసం ఆమె సేవలు అవసరమన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news