భార‌త్ తో సంబంధాలు కొన‌సాగిస్తాం..తాలిబ‌న్ల అగ్ర‌నేత ప్ర‌క‌ట‌న‌..!

-

భార‌త్ తో సంబంధాలు కొన‌సాగిస్తామ‌ని తాలిబ‌న్ల అగ్ర‌నేత షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టనెక్‌జాయ్ ప్ర‌క‌టించారు. భారత్ తో సాంస్కృతిక, వాణిజ్య‌, రాజ‌కీయ‌, వ్యాపార సంబంధాలు కొన‌సాగిస్తామ‌ని ప్ర‌క‌టించారు. అంతే కాకుండా భార‌త్ ఆఫ్గ‌నిస్తాన్ కు ముఖ్య‌మైన దేశమ‌ని వ్యాఖ్యానించారు. ఈ మేర‌కు అబ్బాస్ సోష‌ల్ మీడియా ద్వారా అధికారిక వీడియోను విడుద‌ల చేశారు. ఆఫ్గ‌నిస్తాన్ లో చాంబ‌హార్ ప్రాంతాన్ని భార‌త్ అభివృద్ధి చేసింద‌ని అబ్బాస్ పేర్కొన్నారు.

talibans on business activities with india
talibans on business activities with india

అంతే కాకుండా ప‌లు సంస్థ‌లు..గ్రూపుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన త‌ర‌వాత ఆఫ్గ‌నిస్తాన్ ఓ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని అబ్బాస్ వెల్ల‌డించారు. త‌మ ప్ర‌భుత్వంలో విభిన్న వ‌ర్గాల ప్ర‌జ‌ల ప్రాతినిధ్యం ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. భార‌త్ మాత్ర‌మే కాకుండా చైనా,ర‌ష్యా, పాకిస్థాన్ దేశాల‌తోనూ స‌త్సంబంధాలు కొన‌సాగిస్తున్నామ‌ని అబ్బాస్ వెల్ల‌డించారు.

Read more RELATED
Recommended to you

Latest news