రాష్ట్రంలో రాజకీయ డ్రామాలు నడుస్తున్నాయి… తలసాని

-

తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ డ్రామాలు నడుస్తున్నాయని తాజా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడిచి ఏపీ సీఎం చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటున్నారన్నారు. తెదేపా – కాంగ్రెస్ లు ఆరునెల్ల క్రితం నుంచే రహస్య పొత్తుపెట్టుకున్నాయని ఆరోపించారు.

పొత్తు మూలంగా చంద్రబాబు భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లపై మాట్లాడే కనీస అర్హత అమిత్ షాకు  లేదన్నారు. భాజపా ఉన్న 5 స్థానాలను దక్కించుకుంటే మహా గొప్పే అని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news