రోడ్డు ప్రమాదంలో గీతం సంస్థల అధినేత మృతి

-

తెదేపా శాసన మండలి సభ్యుడు, గీతం విశ్వవిద్యాలయం అధినేత ఎంవీవీఎస్ మూర్తి అమెరికాలో జరగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. కాలిఫోర్నియా నుంచి అలస్కాలోని ఆంకరేజ్‌‌ సఫారీని సందర్శించేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆయన ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న వ్యానుని ఢీకొట్టడంతో ఆయనతో పాటు కారులో ప్రయాణిస్తున్న  వీరమాచినేని శివప్రసాద్, బసవపున్నయ్య, వి.బి.ఆర్‌ చౌదరి మృతి చెందగా.. కడియాల వెంకటరత్నం తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెల 6న గీతం పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొనెందుకు అమెరికాలో వచ్చినట్లు తెలుస్తోంది.  తెలుగు రాష్ట్రాల్లోని అనేక సేవా సంస్థలకు ఆయన చేయూతనందించారు. యువతకు సంబంధించిన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనేందుకు ఆసక్తిని చూపుతారు. ఆయన మరణాన్ని తెలుగు ప్రజలు జీర్ణించుకోలేపోతున్నారు.

ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఇతర ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news