వైసీపీకి ఎంపీ బాలశౌరి రాజీనామా.. ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీగా ఉన్న బాలశౌరి.

-

ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్లో రాజకీయాలు రోజురోజుకు మారుతున్నాయి. ప్రముఖు రాజకీయ నాయకుల రాజీనామాలు, చేరికలతో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. టికెట్ రాని నేతలు నిరాశతో పార్టీలు మారుతున్నారు. తాజాగా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి వైసీపీకి రాజీనామా చేసి భారీ షాక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి మరొకరిని బరిలోకి దించనున్నట్లు తెలియడంతో బాలశౌరి ఈ నిర్ణయం తీసుకున్నారు. తనకు పోటీ చేయడానికి వైసీపీ రెండోసారి అవకాశం ఇవ్వడం లేదన్న సమాచారంతో మనస్తాపానికి గురై పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

 

 

ప్రస్తుత మాజీ మంత్రి పేర్ని నాని,బందర్ ఎమ్మెల్యేతో బౌలశౌరికి గత కొంతకాలంగా విభేదాలున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఆయన జనసేనలో చేరుతారని వార్తలు వినిపిస్తున్నాయి.ఆ పార్టీ నుంచి మచిలీపట్నం ఎంపీగా లేదంటే పొన్నూరు ,అవనిగడ్డ అసెంబ్లీ టికెట్ కావాలని బాలశౌరి డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై క్లారిటీ వచ్చిన వెంటనే బాలశౌరి జనసేన పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.

 

Read more RELATED
Recommended to you

Latest news