శ్రీనివాస్ కి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత..

-

ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం చేసిన శ్రీనివాసరావుకు మంగళవారం హఠాత్తుగా గుండె నొప్పి వచ్చిందని పోలీసులు హైడ్రామా క్రియేట్‌ చేసి కేజీహెచ్ కి తరలించారు. ఆస్పత్రిలోనే సుమారు రెండుగంటల పాటు వార్డుల చుట్టూ తిప్పి తిప్పి వైద్య పరీక్షలు అనంతరం అతనికి ఎలాంటి ఇబ్బంది లేదని  అంతా బాగానే ఉందని వైద్యులు చెప్పడంతో హైడ్రామాకు తెరపడింది. ఈ క్రమంలో ఆస్పత్రి వద్దకు రాగానే శ్రీనివాసరావు పెద్దపెద్ద కేకలు వేస్తూ తనకు ప్రాణహాని ఉందని, తనను ప్రజలతో మాట్లాడనివ్వాలని కోరారు.

ఈ విషయం పై స్పందించిన వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ… నిందితుడు శ్రీనివాస్ కు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. దాడిపై కేంద్రం థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలని కోరుతున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news