సంక్రాంతి పోటీలో సత్తా చాటిన ‘హనుమాన్’.. పార్ట్-2 పై ఇంట్రెస్టింగ్ అప్డేట్….

-

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ,యువ హీరో తేజ సజ్జ కాంబినేషన్లో ఎన్నో అంచనాల మధ్య వచ్చిన హనుమాన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 12 భాషల్లో గ్రాండ్ గా విడుదల అయింది. రిలీజ్ అయిన ప్రతీ చోట పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’కు పోటీగా సంక్రాంతి బరిలోకి దిగి సక్సెస్ అయ్యారనే చెప్పారు. ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ రావడంతో పలు థియేటర్లలో టికెట్స్ హాట్ కేకుల్లా బుక్ అయిపోతున్నాయి.

 

 

ఇదిలా ఉండగా..’హనుమాన్’ పార్ట్-2కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సినిమా క్లైమాక్స్ లో దర్శకుడు ప్రశాంత్ వర్మ క్రేజ్ అప్డేట్ ఇచ్చారు. 2025లో హనుమాన్ కు సీక్వెల్ రాబోతోందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. పార్ట్-2 కి ‘జై హనుమాన్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. దీంతో అభిమానులలో మరింత ఆసక్తి పెరిగింది. మరోవైపు ఏపీ లో అనేక ప్రాంతాల్లో ఈ మూవీకి థియేటర్ల సంఖ్య పెరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news