సన్ రైజర్స్ హైదరాబాద్ కి వరల్డ్ కప్ హీరోలు….

-

ఈరోజు దుబాయ్ వేదికగా ఐపిఎల్ 2024 సీజన్ కి మినీ వేలం జరిగింది. ఇందులో స్వదేశీ మరియు విదేశీ ఆటగాళ్ల ఉన్నారు. అయితే ఈ వేలములో ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ ప్యాట్ కమిన్స్ ని 20.5 కోట్లకి మరియు విధ్వంసకర ఆటగాడు ట్రావెల్స్ హెడ్ ని 6.8 కోట్లకి సన్రైజర్స్ హైదరాబాద్ దక్కించుకున్నారు.

 

కాగా… ఇటీవల జరిగిన వన్డే ప్రపంచ కప్ లో కమిన్స్ ఆస్ట్రేలియాను విశ్వవిజేతగా నిలిపిన సంగతి తెలిసిందే. అలాగే మరొక ఆటగాడు ట్రావిస్ హెడ్ ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ పై సెంచరీ చేసి ఆస్ట్రేలియా జట్టుకి ఘన విజయాన్ని అందించాడు.

 

అలాగే ఈ వేలంలో భారత ఫేసర్ హర్షల్ పటేల్ను పంజాబ్ కింగ్స్ 11.75 కోట్లకు దక్కించుకోగా డారెల్ మిచెల్ ని 14.5 కోట్లకు మరియు న్యూజిలాండ్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్రాని 1.8 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకున్నాయి. అలాగే భారత్ సీనియర్ పెసర్ అయినటువంటి ఉమేష్ యాదవ్ ని 5.8 కోట్లు పెట్టి గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. తెలుగు తెలుగు ఆటగాడు కేఎస్ భరత్ ని 50 లక్షలకి కోల్కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news