LK ADVANI :అద్వానికి రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానం….

-

వచ్చే జనవరి 22వ తేదీన జరగబోయే రామ మందిర ప్రారంభోత్సవానికి బిజెపి కురువృద్ధులు మురళి మనోహర్ జోషి మరియు ఎల్ కె అద్వానికి విశ్వహిందూ పరిషత్ ఆహ్వానం పలికింది. వారిని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ గారు స్వయంగా ఆహ్వానించారు. సోమవారం నాడు రామ మందిరం ట్రస్ట్ రామ మందిరం ఉద్యమానికి ఊపిరిలూది ఉప్పెనలా మార్చినటువంటి దిగ్గజా నేతలకు ఆహ్వానం అందని నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.

ప్రస్తుతం అద్వానీ గారికి 96 సంవత్సరాలు ఉండగా మురళి మనోహర్ జోషి గారికి 89 సంవత్సరాలు. అయితే వారి వయస్సును దృష్టిలో పెట్టుకొని వారిని రామ మందిరం ఉత్సవానికి హాజరు కావద్దని విజ్ఞప్తి చేశామని దానికి వారిద్దరు సమ్మతించారని రామమందిరం ట్రస్ట్ పేర్కొంది. ఈ విషయాన్ని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మీడియాకు తెలిపాడు. దీంతో రాజకీయంలో దుమారం రేగింది. కాగా ప్రస్తుతం ఈ ఆహ్వానం నేపథ్యంలో వారు ఇద్దరు హాజరు అవుతారని సమాచారం

.

Read more RELATED
Recommended to you

Latest news