హైదరాబాద్ రానున్న అమిత్ షా

-

భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శనివారం తెలంగాణలో పర్యటించనున్నారు. మహబూబ్ నగర్ లోని ఎంవీఎస్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభా స్థలి నుంచి ఎన్నికల ప్రచారాన్ని అమిత్ షా ప్రారంభించనున్నారు . బేగం పేట విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం పార్టీ కార్యాలయానికి చేరుకుని మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు. అనంతరం పాత బస్తీలోని లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారిని షా దర్శంచుకుంటారు. ఆ తర్వాత మహబూబ్ నగర్ లో నిర్వహించే బహిరంగ సభకు భారీ ర్యాలీగా బయల్దేరి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర, జిల్లాల భాజపా నేతలతో ఎన్నికల గురించి చర్చించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news