బ్రేకింగ్ : 10మంది కరోనా బాధితులు పరార్..

-

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి నుంచి పది మంది కరోనా బాధితులు పరారయ్యారు. ఎవ్వరికంటా పడకుండా బాధితులు తమ ఇళ్లకు వెళ్ళిపోయారు శనివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే పరారైన వారిలో ఇప్పటికే ఆరుగురు బాధితులు ఐసోలేషన్ వార్డులో ఉన్నవారు. కాగా, మరో నలుగురు కరోనా అనుమానంతో ఐసొలేషన్ వార్డులో చేరినట్లు తెలుస్తోంది. వారి శాంపిళ్లను సేకరించి పరీక్ష నిమిత్తం ల్యాబ్‌కు తరలించారు.

corona rajamundry
 

ఫలితాలు రావడానికి ముందే వీరు పరారీ అయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ వ్యవహారం రిమ్స్ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఆస్పత్రిలో సరైన సేవలు అందించడం‌లో జరుగుతున్న జాప్యం కారణంగానే వీరు పరారైనట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లా కేంద్రంలో ఇద్దరు, ఇంద్రవెల్లికి చెందిన ఇద్దరు, ఇతర ప్రాంతాలకు చెందిన మరో ఆరుగురు ఇళ్లకు వెళ్లిపోయినట్లు గుర్తించారు. కాగా, ఇప్పటికే నలుగురు బాధితులు ఫోన్‌లో అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news