కారు తనిఖీల్లో రూ.10 కోట్లు

-

 

తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో భారీ స్థాయిలో డబ్బు పట్టుబడుతోంది. దీంతో ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా  ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలంలో పిప్పరివాడ టోల్‌ప్లాజా వద్ద సోదాలు జరిపి ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.10 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.

మహారాష్ట్ర నాగ్‌పూర్‌ జిల్లా జామ్‌ నుంచి హైదరాబాద్‌ వైపు ఈ నగదును తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కారు డ్రైవర్‌ సర్వేశ్‌, వినోద్‌ శెట్టిలను అదుపులోకితీసుకొని విచారిస్తున్నారు. రూ.500 నోట్ల కట్టలను కారు డిక్కీలో బస్తాల్లో కుక్కిమరి తీసుకెళ్లడాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యానికి గురిచేసింది. కారుతో పాటు నగదును స్వాధీనం చేసుకున్న సీఐ సురేశ్‌, ఎస్సై తిరుపతి ఈ నగదు అక్రమ తరలింపునకు సంబంధించిన అంశాలపై ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news