జగన్నాథుని ఆలయంలో అతి పెద్ద కింగ్‌ కోబ్రా..!

-

పది అడుగుల పొడవైన పాము జగన్నాథ్‌ ఆలయంలో కలకలం రేపింది. దీంతో భక్తులంతా హడలెత్తిపోయారు. విషయం తెలుసుకున్న అధికారులు దాన్ని పట్టుకున్నారు. ఈ ఘటన ఒడిశాలోని గంజాం‌ జిల్లాలో ఉన్న శారదా జగన్నాథ్‌ ఆలయంలో చోటుచేసుకుంది. దేవాలయంలో పామును చూసిన ఓ భక్తురాలు ఆలయ అధికారులకు సమాచారం అందించింది.

వారు అటవీ శాఖ అధికారులకు విషయం చెప్పారు. దీంతో అటవీ శాఖ అధికారులతో పాటు పీపుల్‌ ఫర్‌ యానిమల్స్‌ కు చెందిన సభ్యులు వచ్చి ఆ పామును పట్టుకున్నారు. అనంతరం దాన్ని సమీపంలోని అడవిలో వదిలేశారు. దీంతో అక్కడ కొంచంసేపు భయానక వాతావరణం ఏర్పడింది. అలాగే చుట్టుపక్కల ఇంకేమైనా పాములు ఉన్నాయేమోనని అధికారులు వెతకడం మొదలుపెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news