అమ్మో ఆన్ లైన్ లోన్ యాప్స్.. నిన్న ఒక్క రోజే వంద కేసులు.. !

-

ఆన్ లైన్ లోన్ యాప్ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సైబరాబాద్ సైబర్ క్రైమ్ లో నిన్న ఒక్క రోజే 16 కేసులు నమోదు కాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ లో నిన్న ఒక్క రోజే 39  లు కేసులు నమోదు అయ్యాయి, రాచకొండ సైబర్ క్రైమ్ లో నిన్న ఒక్క రోజే 30 లు కేసులు నమోదు అయ్యాయి. అలా మూడు కమిషనరేట్ లలోని సైబర్ క్రైమ్ లో నిన్న ఒక్క రోజే వంద కేసులు నమోదు కావడం సంచలనంగా మారింది. డబ్బులు చెల్లించమని బూతులు తిడుతూ లోన్ యాప్ ప్రతినిధులు ఫోన్లు చేస్తున్నారు.

ఇంట్లోని మహిళలకు కూడా ఫోన్ చేసి అసభ్య పదజాలంతో లోన్ యాప్స్ ప్రతినిధులు మాట్లాడుతున్నారు. ఫోన్ లోని డాటాను యాక్సెస్ చేస్తున్న కేటుగాళ్లు, అందరికీ ఫోన్లు చేస్తున్నారు. ఈ క్రమంలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ లోన్ సంస్థల వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. గతంలో చైనా నుండి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు అనుమతులు పొందిన కొన్నింటిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. డబ్బులు వసూలు చెయ్యడానికి లోన్ యాప్ నిర్వాహకులు థర్డ్ పార్టీ ఏజెన్సీలకు అప్పగిస్తున్నారు. వారే ఈ రకమైన వేధింపులకి పాల్పడుతున్నారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news