కేబుల్ బ్రిడ్జ్ వద్ద సూసైడ్.. దానికోసమే ఫ్లైట్ లో హైదరాబాద్ కి ?

-

మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ కింద ఒక వ్యక్తి మృతదేహం లభ్యం అయింది. ఆ మృతిని జేబులో దొరికిన ఆధార్ కార్డ్ ఆధారంగా మృతుని పేరు షేక్ బిలాల్ హుస్సేన్(24)గా నిర్ధారణకు వచ్చారు. విశాఖపట్నం నుండి ఈ నెల 18న ఇండిగో విమానంలో హైద్రాబాద్ కు వచ్చినట్లు మృతుని జేబులో టికెట్ ను బట్టి పోలీసులు నిర్ధారించారు.

మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. అయితే పోలీసుల ప్రాధమిక దర్యాప్తు మేరకు బీ టెక్ పూర్తి చేసి ఉద్యోగం లేక మనోవ్యధతో బిలాల్ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని తెలుస్తుంది. అతను ఇంట్లో నుండి వచ్చేప్పుడు BYE అని సూసైడ్ నోట్ రాసి వచ్చినట్టు సమాచారం. ఇక ఈ ఆత్మహత్య కు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు మాదాపూర్ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news