100 మంది కేసీఆర్ లు వచ్చినా నన్ను ఓడించలేరు : భట్టి విక్రమార్క

-

వందమంది కేసీఆర్ లు వచ్చిన తనను ఓడించలేరని సీఎల్పీ నేత మధిర కాంగ్రెస్ అభ్యర్థి బట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మధిరలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి యాత్రలో ఆ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ తో పాటు పలువురు సీనియర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తి విక్రమార్క మాట్లాడుతూ కేసీఆర్ కేటీఆర్ వచ్చి ఎన్ని ప్రగల్బాల్ పలికిన తాను మధిరలో 50వేల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. మధిర పోరాటాల పురిటి గడ్డ అని సాయిధరైతాంగ పోరాటానికి ఊపిరి ఉలూది నా గడ్డ ఇది అని చెప్పారు. ఫీడల్ ప్రభుత్వమైన బిఆర్ఎస్ ను బంగాళాఖాతంలో కలపాలని ప్రజల ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని ఓటర్లకు పిలుపునిచ్చారు భట్టి విక్రమార్క.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంపద అందరికీ సమానంగా అందుతుందని భావిస్తే టిఆర్ఎస్ నేతలు మాత్రమే దానిని దోచుకుంటున్నారని విమర్శించారు బట్టి. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు ప్రతినిరుద్యోగి ఉద్యోగము ప్రతి రైతులకు గిట్టుబాటు ధర రావాలంటే హస్తము గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆదిలాబాద్ నుంచి మధిర వరకు పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకొని మేనిఫెస్టో రూపొందించామని బట్టి వివరించారు పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ స్కీములను ప్రకటించిందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news