టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులకు అలర్ట్ !

-

ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి విద్యార్థులకు మార్చి లో జరిగిన పబ్లిక్ పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రభుత్వం ఒక కీలక సూచన అందించింది. ఈ విద్యార్థులు అందరూ రానున్న మార్చి లో పబ్లిక్ పరీక్షలు రాయవచ్చని విద్యాశాఖ తెలిపింది. ఇందుకు గాను ఈ రోజు నుండి సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఫీజులు చెల్లించాలని ప్రకటన జారీ చేసింది. ఇక విద్యాశాఖ స్కూళ్లకు సైతం ఫీజులు తీసుకోవడానికి ఏర్పాట్లు చేయాలనీ ఆదేశాలు ఇచ్చింది. నిరాయించిన గడువు ముగిసిపోతే … సెప్టెంబర్ 20 వరకు రూ. 50 ఫైన్ తో చెల్లించాలి, అదే విధంగా సెప్టెంబర్ 30 వరకు అయితే రూ. 500 ఫైన్ తో ఫీజు కట్టాలని నిబంధనలను విధించింది. ఇక విద్యార్థులు మూడు సబ్జెక్టు ల వరకు ఒక్కో సబ్జెక్టు కు రూ. 110 మరియు మూడు సబ్జెక్టు లు దాటితే ఒక్కో సబ్జెక్టు కు రూ. 125 లు చెల్లించాలని విద్యాశాఖ తెలిపింది.

ఇక ఎందుకు ఆలస్యం విద్యార్థులు వెంటనే సంబంధిత స్కూల్స్ కు వెళ్లి ఫీజును చెల్లించండి.

Read more RELATED
Recommended to you

Latest news