విద్యార్థులకు బిగ్ అలర్ట్.. నేడే తెలంగాణ 10వ తరగతి పరీక్ష ఫలితాలు

-

తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు జూన్ 30న అంటే ఇవ్వాలా విడుద‌ల చేయనున్నట్లు తెలిపింది విద్యాశాఖ. ఈ మేర‌కు ఎస్సెస్సీ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవాళ ఉద‌యం 11:30 గంట‌ల‌కు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి టెన్త్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు మే 23 నుంచి జూన్ 1వ తేదీ వ‌ర‌కు కొన‌సాగిన విష‌యం తెలిసిందే. ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,09,275 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా వీరిలో 99 శాతం మంది హాజరయ్యారు.

రెండేళ్ల తర్వాత పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఏ మేర ఉత్తీర్ణత సాధిస్తారన్న విషయంపై సర్వాత్రా ఆసక్తి నెలకొంది.టెన్త్ విద్యార్థులు తమ ఫలితాలను www.bse.telangana.gov.in లో చెక్ చేసుకోవచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news