ఉపాధ్యాయుల నిర్లక్ష్యానికి బలైన పదో తరగతి విద్యార్ధిని.. ఏం జ‌రిగిందంటే..?

-

ఉపాధ్యాయుల నిర్ల‌క్ష్యానికి ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థిని బ‌లైపోయింది. వివ‌రాల్లోకి వెళ్తే.. మెదక్‌ జిల్లాలో డెంగ్యూతో విద్యార్థిని మృతి చెందడం కలకలం రేపుతోంది. గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతోన్న కావ్య వారం రోజులుగా జర్వంతో బాధపడుతోంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా ఉపాధ్యాయులు దాచిపెట్టారు. కన్నబిడ్డను కలుసుకునేందుకు వచ్చిన తల్లిదండ్రులు నీరసంగా కనిపించిన కూతురిని తమతో ఇంటికి తీసుకెళ్లారు.

అనంతరం హైదరాబాద్‌లో ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేర్పించగా డెంగ్యూగా నిర్ధారించారు. ట్రీట్‌మెంట్‌ జరుగుతుండగా కావ్య మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ బిడ్డ చావుకు ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే కారణమంటూ శవంతో స్కూల్‌ ఎదుట ఆందోళనకు దిగారు.

Read more RELATED
Recommended to you

Latest news