పట్టాభి ఇంటిపై దాడి కేసులో 11 మంది అరెస్టు

-

పట్టాభి ఇంటిపై దాడి కేసులో 11 మందిని అరెస్టు చేశారు ఏపీ పోలీసులు. కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా ఇంటిలోకి ప్రవేశించి ఇంటిలో ఉన్న వస్తువులు ధ్వంసం చేసారని పట్ఠాభి కంప్లైంటు చేశారు. పట్టాభి భార్య కొమ్మారెడ్డి చందన ఇచ్చిన ఫిర్యాదుతో పడమట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. క్రైమ్. నెం. 953/2021 సెక్షన్ 148, 427,452, 506 R/w 149 ఐ.పి.సి. క్రింద ఏకంగా 11 మంది పై కేసు నమోదు నమోదు చేసుకున్నారు పోలీసులు.

arrest
 

నిందితుల వివరాలు వివరాల్లోకి వెళితే.. బచ్చు మాధవి కృష్ణ, ఇందుపల్లి సుభాషిణి, తుంగం ఝాన్సీరాణి, బేతాల సునీత, యల్లాటి కార్తీక్, గొల్ల ప్రభుకుమార్, వినుకొండ అవినాష్, గూడవల్లి భారతి, సీతారామపురం, దండు నాగమణి, వంకాయలపాటి రాజ్కుమార్, బచ్చలకూరి అశోక్ కుమార్ ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. అయితే ఈ కేసు లో అరెస్ట్ అయిన వారందరు విజయవాడ కు చెందిన వారే కావడం గమనార్హం. కాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు కేసులో అరెస్ట్ అయిన పట్టాభి రామ్ కి బెయిల్ మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హై కోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news