శివసేనకు షాకిచ్చిన 12 మంది ఎమ్మెల్యేలు!

-

మహారాష్ట్రలోని ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడి సర్కార్ కు భారీ షాక్ తగిలింది. అసంతృప్తితో కూటమికి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు గుజరాత్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఓ మంత్రి 11 మంది ఎమ్మెల్యేలు సూరత్ లోని ఓ హోటల్ లో బస చేస్తునట్లు సమాచారం. వీళ్లంతా గుజరాత్ బిజెపి అధ్యక్షుడు సిఆర్ పాటిల్ తో టచ్ లో ఉన్నారని సమాచారం. శివసేన కీలక నేత మంత్రి ఏకనాథ్ షిండే ఆ పార్టీకి చెందిన మరో 11 మంది ఎమ్మెల్యేలతో క్యాంపు రాజకీయాలకు తెరలేపారు.

సూరత్ లోని గ్రాండ్ పార్క్ హోటల్ లో బస చేశారని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. ఇక అధిష్టానంపై షిండే గత కొద్దికాలం నుంచి అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక శివసేన మాజీ నేత నారాయణ్ రాణే దీనిపై స్పందిస్తూ.. ఇలాంటి వాటిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని అన్నారు. ఎన్సీపీ అధికార ప్రతినిధి మహేష్ మాట్లాడుతూ.. మహా వికాస్ అఘాడికి ఎటువంటి డోకా లేదని.. ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news