తెలంగాణ లో కొత్త‌గా 160 క‌రోనా కేసులు.. ఒర‌కు మృతి

-

తెలంగాణ రాష్ట్రం లో గ‌డిచిన 24 గంట‌ల లో కొత్త‌గా 160 కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో క‌రోనా వైర‌స్ బాధితుల సంఖ్య 6,75,479 కి చేరింది. కాగ ఈ రోజు రాష్ట్రం లో మొత్తం 32,540 మంది కి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. అలాగే గ‌డిచిన 24 గంట‌ల లో తెలంగాణ రాష్ట్రం లో క‌రోనా మ‌హ‌మ్మారి బారీన ప‌డి ఒక‌రు మృతి చెందారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రం లో క‌రోనా మ‌హ‌మ్మారి బారిన ప‌డి మృతి చెందిన వారి సంఖ్య 3,988 కి చేరింది.

కాగ ఈ రోజు రాష్ట్రం లో 148 మంది క‌రోనా వైర‌స్ ను జ‌యించారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ రాష్ట్రం లో క‌రోనా వైర‌స్ ను జ‌యించిన వారి సంఖ్య 6,67,946 కు చేరింది. అలాగే ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,545 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగ క‌రోనా వైర‌స్ ప‌ట్ల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తం గా ఉండాల‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు. వ్యాక్సిన్ వేసుకున్న వారు కూడా జగ్ర‌త్త‌లు పాటించాల‌ని తెలిపారు. కొత్త‌గా ఓమిక్రాన్ వేరియంట్ వెలుగు చూడ‌టం తో ప్ర‌జ‌లు త‌ప్ప‌కుండా జగ్ర‌త్తలు వ‌హించాల‌ని వైద్య ఆరోగ్య అధికారులు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news