ధవళేశ్వరం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక.. 175 గేట్లు ఎత్తివేత !

-

తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు నిండుకుండలా మారుతున్నాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద క్రమేపి గోదావరి వరద నీటిమట్టం పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 7. 80 అడుగులు వద్ద నీటిమట్టం కొనసాగుతోంది. బ్యారేజ్ నుండి 3 లక్షల 09 వేల క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దీని కోసం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ కు చెందిన 175 గేట్లు ఎత్తివేశారు.

ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరదనీటిని నేరుగా సముద్రంలోకి విడుదల కానుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు పరవళ్లు తొక్కుతోంది గోదావరి. ఇక గోదావరి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో గోదావరి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. సముద్రంలోకి విడుదల చేసే గోదావరి మిగులు జలాలు 10 లక్షలకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version