మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన నేడు 2 కేబినెట్ సబ్‌కమిటీ భేటీలు!

-

రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ, రేషన్ కార్డులు, హెల్త్ కార్డులపై సోమవారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన 2 కేబినెట్ సబ్‌కమిటీ భేటీలు జరగన్నాయి. జలసౌధ భవనంలో ఈ సమావేశం నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం 2 గంటలకు మంత్రి ఉత్తమ్ చైర్మన్‌గా రేషన్ కార్డులు,హెల్త్ కార్డులపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. ఇందులో రేషన్,హెల్త్ కార్డుల జారీ కోసం గతంలో ఎమ్మెల్యేలకు,రాజకీయ పార్టీలకు సబ్ కమిటీ రాసిన లేఖలతో పాటు వచ్చిన సిఫారసులు, విధి విధానాలపై చర్చించనున్నారు. ఇందులో మంత్రులు దామోదర్ రాజానర్సింహ,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొననున్నారు.

అనంతరం సాయంత్రం 4 గంటలకు ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది.ఇందులో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు,వర్గీకరణ అమలుకు సంబంధించిన అంశాలపై మంత్రి ఉత్తమ్ చైర్మన్‌గా చర్చ జరగనుంది.ఈ మీటింగ్‌లో కో చైర్మన్ దామోదర్ రాజా నర్సింహ,సభ్యులు మంత్రులు శ్రీధర్ బాబు,పొన్నం ప్రభాకర్,సీతక్క,ఎంపీ మల్లు రవి పాల్గొననున్నారు. రెండో మీటింగ్‌ జరగడానికి ముందు 3.45 గంటలకు సచివాలయ ప్రాంతంలో దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news