Hyd: నర్సింగ్ విద్యార్ధిని హత్య…? ఆత్మహత్య…? గదిలో రక్తపు మరకలు !

-

హైదరాబాద్‌ గచ్చిబౌలి రెడ్‌స్టోన్‌ హోటల్‌లో నర్సింగ్‌ విద్యార్థిని దారుణ హత్య చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అత్యాచారం చేసి హత్య చేశారని బంధువులు ఆరోపణ చేస్తున్నారు.. హోటల్‌ గది అంతటా రక్తపు మరకలు ఉన్నాయి. భారీగా మద్యం బాటిల్స్‌ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక నర్సింగ్‌ విద్యార్థి శృతి పేరెంట్స్ వెంకట్ సువర్ణ మాట్లాడుతూ… ఈ నెల 14న నలుగురు కలిసి రెడ్ స్టోన్ హోటల్ వచ్చారని… శ్రుతి బీఎస్సీ నర్సుగా ఓ హాస్పిటల్ లో పని చేస్తుందని తెలిపారు.

hyderabad nursing student case

మాది జడ్చర్ల.. పిల్లల కోసం మేము గచ్చిబౌలి వచ్చామన్నారు. ఈ రోజు టెక్కవారు జీవన్ అనే అబ్బాయి మాకు కాల్ చేసిండని… శృతి ఉరేసుకొని సూసైడ్ చేసుకుందని చెప్పినట్లు వివరించారు. మేము వచ్చేలోపే మా పాప శృతి మృతదేహం పోలీసులు తరలించారని పేర్కొన్నారు. గదిలో రక్తం మరకలు ఉన్నాయని… గదిలో మద్యం బీరు బాటిల్స్ ఉన్నాయని కూడా తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ సంఘటనపై మాకు అనుమానం ఉంది…మా కూతురుపై అత్యాచారం చేసి హత్య చేశారని అనుమానం కలుగుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news