నేడు తెలంగాణ‌లో కొత్త‌గా 241 క‌రోనా కేసులు

-

తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌తి రోజు క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ రోజు విడుద‌ల చేసిన క‌రోనా బులిటెన్ ప్రకారం.. రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 30,978 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు. ఈ క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షల‌లో కేవ‌లం 241 మందికి మాత్ర‌మే క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. కాగ ఈ ప‌రీక్షల‌లో ఇంకా.. 847 ఫ‌లితాలు రావాల్సి ఉంది. కాగ నేటి వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా 7,88,624 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి.

అలాగే గ‌డిచిన 24 గంటల్లో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఎవ‌రూ కూడా మ‌ర‌ణించ‌లేదు. గ‌త కొద్ది రోజుల నుంచి రాష్ట్రంలో క‌రోనా మ‌ర‌ణాలు న‌మోదు కావ‌డం లేదు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 512 మంది కరోనా వైర‌స్ నుంచి కోలుకున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో రిక‌వ‌రీ రేటు 99.08 శాతంగా ఉంది. కాగ రాష్ట్రంలో ప్ర‌స్తుతం 3,539 క‌రోనా యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. కాగ రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా ప‌లు ఆంక్షల‌ను స‌డ‌లించింది. రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి పూర్తిగా త‌గ్గుమూఖం ప‌ట్ట‌డంతో ప్ర‌జ‌లు.. క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌డం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news