టచ్ లోకి 25 మంది కాంగ్రెస్ ఎమ్యెల్యేలు… మళ్ళీ సీఎం కేసీఆరే !

-

25 మంది కాంగ్రెస్ ఎమ్యెల్యేలు టచ్ లో ఉన్నారని… కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు దశాబ్దకాలం తర్వాత ఓ తెలుగు న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతు…కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు మా పార్టీ నేతలతో టచ్లో ఉన్నారు. మాతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని అంటున్నారన్నారు.

25 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని బాగా నడుపుదామని వారు అంటున్నారు అని కేసీఆర్ అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో జరిగే ఎన్నికల్లో జగన్ మళ్లీ గెలుస్తారనే సమాచారం ఉందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెల్లడించారు. ‘ఏదో ఒక పార్టీకి నేను వత్తాసు పలకడం సరికాదు. వాళ్ల రాజకీయాలు వాళ్లు చేసుకుంటున్నారు. నాకు అందిన సమాచారం ప్రకారం జగనే గెలుస్తారు అని అన్నారు. ఎవరు గెలిచినా మాకు సంబంధం లేదు. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి జోక్యం చేసుకోదు అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news