నేడు నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ బస్సు యాత్ర

-

సార్వత్రిక ఎన్నికల్లో సత్తాచాటి రాష్ట్రంలో పట్టు నిలుపుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. అధినేత కేసీఆర్ బస్సు యాత్రలతో జనాల్లోకి వెళ్తుండగా.. ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా కేటీఆర్, హరీశ్‌ రావు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఆలోచించి ఓటేయాలని కేసీఆర్  ప్రజలకు పిలుపునిస్తున్నారు. పదేళ్ల బీజేపీ పాలనలో అచ్చేదిన్‌ స్థానంలో చచ్చేదిన్‌ వచ్చిందని ఆరోపించారు. ఇక అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ అబద్ధాలతోనే మళ్లీ ఈ ఎన్నికల్లోనూ గెలవాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగనుంది. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌కు మద్దతుగా కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పాత కలెక్టరేట్ నుంచి బస్టాండ్ మీదుగా నెహ్రూ పార్క్ వరకు కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగనున్నట్లు స్థానిక నేతలు తెలిపారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు నెహ్రూ పార్క్ కూడలిలో కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. కేసీఆర్ రాక సందర్భంగా స్థానిక నేతలు ఏర్పాట్లలో బిజీ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news