త్వరలో కాంగ్రెస్ లోకి చేరనున్న 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు : బీర్ల ఐలయ్య

-

గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో ఆ పార్టీలో నుంచి ఒకరి తర్వాత మరొకరు వేరే పార్టీలోకి చాలామంది నాయకులు క్యూ కడుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సంచలనం వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తో 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు… త్వరలో వాళ్లంతా కాంగ్రెస్ పార్టీలో చేరతారని బాంబు పేల్చారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన నచ్చే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ అందుబాటులో ఉంటున్నారని ఆయన స్పష్టం చేశారు.ఇంకో నాలుగు గేట్లు తెరిస్తే బీజేపీ, బీఆర్ఎస్ లో ఒక్కరు కూడా మిగలరని బీర్ల ఐలయ్య అన్నారు.

ఇప్పటికే గేట్లు తెరిచామని కాంగ్రెస్ ట్వీట్ చేసిన మరుసటి రోజే చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి… ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరారని అన్నారు.ఇప్పటికే హైదరాబాద్ లోని చాలా మంది కార్పొరేటర్లు ,కంటోన్మెంట్ బీజేపీ ఇన్ చార్జ్ శ్రీ గణేష్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. జిల్లాలోనూ బీఆర్ఎస్ కు చెందిన నేతలు కాంగ్రెస్ లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news