బ్రేకింగ్ ఏపీలో 38 కొత్త కేసులు…!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ అత్యంత వేగంగా తన ప్రభావం చూపిస్తుంది. రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది గాని తగ్గడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో మరో 38 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఏపీలో ఇప్పటి వరకు మొత్తం కరోనా పాజిటివ్‌ల సంఖ్య 572కి చేరుకుందని ఏపీ సర్కార్ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. ఇప్పటి వరకు 35 మంది మాత్రమే డిశ్చార్జ్ అయ్యారు.

14 మంది రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు. నేడు కర్నూలు జిల్లాలో ఎక్కువగా కేసులు నమోదు అయ్యాయి. జిల్లాలో 13 కేసులు నమోదు అయ్యాయి. 523 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నెల్లూరులో 6, అనంతపురం, చిత్తూరు జిల్లాలో 5 కేసులు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4 చొప్పున నమోదు అయ్యాయి.

ఇక కడప జిల్లాలో ఒక కేసు నమోదైంది. కడప జిల్లా నుంచి 13 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని నిన్న ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీనిపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. రోజు రోజుకి కేసులు పెరగడం ఇప్పుడు ఏపీ సర్కార్ ని కూడా కలవర పెడుతున్న అంశం.

Read more RELATED
Recommended to you

Latest news