ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 39 మంది దుర్మణం

-

అమెరికాలో జరిగిన ఘోర ప్రమాదంలో 39 మంది దుర్మణం చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓ బస్సు అదుపు తప్పి కొండ మీద నుంచి లోయలో పడటంతో ఈ ఘటన చోటచేసుకుంది.

అమెరికా కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున పశ్చిమ పనామా ప్రాంతంలో జరిగిందీ ఘటన. కొలంబియా నుంచి డేరియన్​ లైన్​ను దాటి పనామాలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని ఓ శిబిరానికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ఆస్పత్రికి తరలిస్తున్నారు.

“అయితే బస్సు డ్రైవర్ ఆ షెల్టర్​ గేట్​ను దాటి ముందుకు వెళ్లింది. దీంతో మళ్లీ హైవేపైకి వచ్చేందుకు ప్రయత్నించగా మరో బస్సు దాన్ని ఢీకొట్టింది. దీంతో వలదారులతో ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది”అని పనామా నేషనల్​ ఇమిగ్రేషన్​ సర్వీస్ డైరెక్టర్​ సమీరా గోజైన్​ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version