ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం… స్పందించిన కేసీఆర్

-

తాజాగా బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్కు కేంద్ర ఎన్నికల కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ఆయన ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. ఇక ఈ అంశంపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ స్పందించారు. ‘నా మాటలను, స్థానిక మాండలికాన్ని అధికారులు సరిగా అర్థం చేసుకోలేదు. కాంగ్రెస్ నేతలు కొన్ని వ్యాఖ్యలను ఎంపిక చేసుకొని, వాటిని వక్రీకరించి ఫిర్యాదు చేశారు. నా వ్యాఖ్యలకు ఆంగ్ల అనువాదం సరికాదు. కాంగ్రెస్ విధానాలు, హామీల అమల్లో వైఫల్యాన్నే ప్రస్తావించా’ అని కేసీఆర్ తెలిపారు.

కాగా, లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ నాయకులు ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 5న సిరిసిల్ల సభలో కేసిఆర్ కాంగ్రెస్పై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. కేసీఆర్ ఎలాంటి సభలు, ర్యాలీలు, ఇంటర్వ్యూల్లో పాల్గొనవద్దని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news