భర్తను కట్టేసి 8 నెలల గర్భిణి మీద 8 మంది గ్యాంగ్ రేప్

-


8 నెలల గర్భవతిని కౄరంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ముంబైలో జరిగింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని తురుచి ఫాటాలో మంగళవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. భర్తను చెట్టుకు కట్టేసి గర్భిణి మీద సామూహిక అత్యాచారం చేశారు. వివరాల్లోకెళితే.. టాస్కావ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న దంపతులు హోటల్ లో పని చెయ్యడానికి పనివాళ్ల కోసం వెదుకుతున్నారు. ఈ క్రమంలో ముకుంద మానె అనే వ్యక్తి దంపతులను సంప్రధించాడు, తుర్చి ఫాటా ప్రాంతానికి రూ. 20 వేలు అడ్వాన్స్ తీసుకుని వస్తే హోటల్ లో పని చెయ్యడానికి కార్మికులను పంపిస్తానని చెప్పాడు.

20 ఏళ్ల మహిళ(8 నెలల గర్భిణి).. తన భర్తతో కలిసి కారులో తిరుచి ఫాటాకు బయల్దేరారు. అయితే మార్గమధ్యలోనే వీరిని ఆపిన ముకుంద్.. భర్తను కారులో చెట్టుకు కట్టేసి తీవ్రంగా చితకబాదాడు. ఆ తర్వాత గర్భిణిని ఓ గదిలోకి తీసుకెళ్లాడు. ముకుంద్‌కు తోడుగా మరో ఏడుగురు కలిశారు. వీరంతా కలిసి గర్భిణిపై విరుచుకుపడ్డారు. గర్భిణి అని చూడకుండా.. ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. దంపతుల వద్ద ఉన్న నగదు, బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటనపై బాధిత దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news