హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో దారుణం: కొండ‌చ‌రియ‌లు విరిగిపడి…9మంది మృతి

-

హిమాచల్‌ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలోని కిన్నౌర్‌ జిల్లా సంగాల్‌ లోయ దగ్గర పెద్ద ఎత్తున కొండచరియలు విరిగి పడ్డాయి. అవి ఎంత తీవ్రతతో ఎత్తైన కొండ మీద నుంచి కిందకి పడ్డాయంటే.. ఒక్క రాయి తీవ్రతమే నది పైన కట్టిన బ్రిడ్జి ఒక్క దెబ్బకు కూలిపోయింది. ఒక్కసారిగా కొండ చరియలు విరిగి పడిన ఈ ఘటన లో ఏకంగా తొమ్మిది మంది మృతి చెందారు.

మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అంతే కాకుండా కొండ దిగువున ఉన్న వాహనాలు, విశ్రాంతి గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొండ చరియలు విరిగిపడుతున్న దృశ్యాలు అత్యంత భయంకరంగా ఉన్నాయి. ఈ ఉత్పాతం ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల సమయంలో చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. అయితే… ఈ ఘటనలో ఇంకా మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్‌ ఉన్నట్లు స్థానికులు అంటున్నారు. అటు అధికారులు కూడా సహయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news