క్రికెట్ బంతి అనుకొని నాటుబాంబు పట్టుకున్న బాలుడు.. చివరికి..!

-

అంత సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో బాలున్ని ఊహించని విధంగా మృత్యువు కబళించింది. ఎవరో చేసిన తప్పుకు చివరికి ఆ బాలుడు బలి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిర్లక్ష్యంగా నాటుబాంబులు పబ్లిక్ ప్లేస్ లో పెట్టడంతో ఆ నాటుబాంబులు చూసిన బాలుడు అవి క్రికెట్ బంతి అనుకొని వాటితో ఆడుకోవడం తో నాటు బాంబు పేలి మృతి చెందిన విషాదకర ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. ఆ కుటుంబంలో తీరని విషాదం నిండిపోయింది.

కర్నూలు జిల్లా అవుకు మండలం చెన్నంపల్లి పాఠశాల పక్కన వర కుమార్ అనే బాలుడు ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అక్కడ ఎవరో దాచి ఉంచిన నాటు బాంబుల చూశాడు బాలుడు ఇలా అవి క్రికెట్ బంతులు అనుకొని వాటి తో ఆడుకోవడం మొదలు పెట్టాడు ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు నాటు బాంబు పేలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు బాలుడు దీంతో స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే తీవ్ర గాయాల పాలు కావడంతో చివరికి మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news