ప్రేమించిన పాపానికి.. ఇంత దారుణమైన చావా..!

-

ఈ మధ్యకాలంలో క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్న విషయం తెలిసిందే. చిన్నచిన్న కారణాలకే మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. ఇక్కడ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది తమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు అనే కారణంతో ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. పాడుబడిన ఇంట్లో శవాలు కుళ్లిపోయి దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించారు ఈ విషాదకర ఘటన సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది.

హైదర్ పల్లి కి చెందిన మధు.. అల్లాపూర్ కు చెందిన సౌమ్య ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల వీరి ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో.. ఒకరినొకరు కలుసుకో కూడదు అంటూ హెచ్చరించారు పెద్దలు. దీంతో తీవ్ర మనస్తాపం చెందింది ఈ ప్రేమజంట. ఒకరిని విడిచి ఒకరు ఉండలేక చివరికి చావులో అయినా ఒకటిగా ఉండాలని భావించి పాడుబడిన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పదిరోజుల తర్వాత దుర్వాసన రావడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news