ఏడాదిన్నరగా ఇంట్లోనే మృతదేహం.. కోమాలో ఉన్నాడని చెబుతూ..

-

ఏడాదిన్నర క్రితం ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆయన కుటుంబం అంత్యక్రియలు చేపట్టకుండా మృతదేహాన్ని ఇంట్లోనే దాచిపెట్టంది. స్థానికులు అతడి గురించి అడిగినప్పుడు కోమాలో ఉన్నాడని అబద్ధం చెప్పింది. దాదాపు ఏడాదిన్నరపాటు ఆ వ్యక్తి చనిపోయాడని.. అతడి మృతదేహం వారి ఇంట్లోనే ఉందని ఎవరికీ తెలియదు. కానీ చివరకు ఇటీవల బయటపడింది. ఎలాగంటే..?

ఉత్తర్ ప్రదేశ్ లోని రావత్​పుర్​లోని శివపురి ప్రాంతానికి చెందిన విమలేశ్​(38) అనే వ్యక్తి .. అహ్మదాబాద్​లో ఆదాయపు పన్ను శాఖలో పనిచేసేవాడు. 2021 ఏప్రిల్​ 22న అతడు మరణించాడు. అయితే విమలేశ్​ మృతి చెందినా.. అతడు కోమాలో ఉన్నాడని అందరికీ చెబుతూ మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకున్నారు కుటుంబసభ్యులు. అయితే విమలేశ్​ భార్య మిథాలీ స్థానిక కో-ఆపరేటివ్​ బ్యాంక్​లో మేనేజర్​గా పనిచేస్తుంది. పెన్షన్​ దరఖాస్తు చేయడానికి విమలేశ్​ మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఆమె సమర్పించడంతో మొత్తం విషయం బయటపడింది. ఆదాయ పన్నుశాఖ.. సీఎంవోకు ఈ విషయాన్ని తెలియజేసింది. సీఎంవో వెంటనే మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవాలని పోలీసులకు ఆదేశించింది.

సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే విమలేశ్​ ఇంటికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అంబులెన్స్​లో ఎల్​ఎల్​ఆర్​ ఆస్పత్రికి తరలించారు. అసలు ఆ కుటుంబం ఇంట్లోనే అతడి మృతదేహాన్ని ఎందుకు ఉంచిందో ఇప్పటి వరకు తెలియలేదు.

Read more RELATED
Recommended to you

Latest news